
నేను శైలజ’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్.. మహానటిలో సావిత్రిగా నటించి అందరినీ అలరించింది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవార్డును కూడా దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో నితిన్తో రంగ్దే, తమిళంలో రజినీకాంత్తో అణ్ణాత్త చిత్రాల్లో నటిస్తోంది. కాగా.. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. పొటిలికల్ పరిచయాలున్న ఓ బిజినెస్మేన్తో స్నేహం చేస్తోందట కీర్తి సురేశ్. తల్లిదండ్రుల సమ్మతితో వీరిద్దరూ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తలపై కీర్తి సురేశ్ ఎలా స్పందిస్తుందో చూడాలి
Comments
Post a Comment