అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరి
ఏపీలో అసెంబ్లీ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ ఈ నెల 31 వరకు ప్రకటించినా బడ్జెట్ సెషన్స్ నిర్వహించక తప్పేలా లేదు. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది.. మార్చి 31 నాటికి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ని ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 31లోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి.. రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించలేని పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని అధిగమించాలంటే మార్చి 31లోగా రాష్ట్ర శాసనసభ, మండలిలో రాష్ట్ర వార్షిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తిప్పి కొడితే మరో వారం రోజులు ఉన్నాయన మాట.
Comments
Post a Comment