'పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.. ఇక మీ ఇష్టం'


 కరోనా వైరస్‌కు బ్రేకులు వేసేందుకు కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. వచ్చే నెల 14 వరకు 21 రోజుల పాటూ లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని హెచ్చిరిస్తున్నారు. కానీ జనాల్ని ఇళ్లలో కూర్చామంటే ఆగుతారా.. బైక్, కార్లు వేసుకుని రోడ్లపైకి వచ్చేస్తున్నారు. పోలీసుల హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇష్టమొచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్నారు.. పోలీసులు ఊరుకుంటారా.. ఆకతాయిల తోలు వలుస్తున్నారు.

కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్నవారికి పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్‌ ఇస్తున్నారు. పనీపాట లేకుండా రోడ్లపై తిరిగేవాళ్లకు బుద్ధి చెప్పేందుకు పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. కొంతమంది పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారికి చిన్న, చిన్న పనిష్మెంట్లు ఇస్తున్నారు. రోడ్డుపై గుంజీలు తీయించడం, వారితో కరోనా వైరస్‌‌ను అంతమొందించేందుకు తమవంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ‌ చేయిస్తున్నారు. కొందరితో ప్లకార్డులు పట్టించి రోడ్డుపై కొద్దిసేపు నిలబెడుతున్నారు.. ప్రజల్లో అవగాహన కల్పించే ఆలోచన చేస్తున్నారు. 

Comments