ఏపీఎస్ ఆర్టీసీలో ఏకంగా 5000 ఉద్యోగాలకు అవకాశం లభించింది . విజయనగరం , విజయవాడ , కడప , నెల్లూరు జోన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి . ఈ ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 15 వ తేదీ లోగా పూర్తి చేస్తారు . ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు ... వీటికి క్వాలిఫికేషన్ పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి . అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను www.apprenticeship.gov.in వెబ్సైట్ నందు అప్ లోడ్ చేసుకోవాలి . ఇందుకు గడువు తేదీ 21-03-2020. దరఖాస్తు చేస్తుకున్న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన సంబంధిత జోన్ల శిక్షణా కళాశాలల కమిటీలు ఏప్రిల్ 9 వ తేదీన ఉంటుంది.
ఎంపికైన అప్రెంటీస్ లకు ఒక్కొక్కరికీ రూ .6931/ స్టైఫండ్ చెల్లిస్తారు . అప్రెంటీషిప్ పూర్తియిన తర్వాత ఆర్టీసీలోనే పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది . ఏప్రిల్ 13 వ తేదీన అప్రెంటీస్ లు గా ఎన్నికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు . ఏపీఎస్ ఆర్టీసీ 2017 నుండి ప్రతి ఏడాది 1390 మంది ఐ . టి . ఐ అర్హత కలిగిన అభ్యర్థులను అప్రెంటిస్ లుగా నియామకం జరుపుతోంది .
ఎంపికైన అప్రెంటీస్ లకు ఒక్కొక్కరికీ రూ .6931/ స్టైఫండ్ చెల్లిస్తారు . అప్రెంటీషిప్ పూర్తియిన తర్వాత ఆర్టీసీలోనే పర్మినెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది . ఏప్రిల్ 13 వ తేదీన అప్రెంటీస్ లు గా ఎన్నికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు . ఏపీఎస్ ఆర్టీసీ 2017 నుండి ప్రతి ఏడాది 1390 మంది ఐ . టి . ఐ అర్హత కలిగిన అభ్యర్థులను అప్రెంటిస్ లుగా నియామకం జరుపుతోంది .
Comments
Post a Comment